రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ‘బ్రహ్మాండ’ చిత్రబృందం సోమవారం కలిసింది. ఈ సందర్భంగా మంత్రి మూవీ పోస్టర్ను విడుదల చేశారు. చిత్ర దర్శకుడు రాంబాబు, నిర్మాత దాసరి సురేశ్ను అభినందించారు. మమత ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కు తున్న ఈ చిత్రానికి సంగీతం: వరికుప్పల యాదగిరి; డీవోపీ: కాసుల కార్తీక్; ఎడిటర్: ఎంఆర్ వర్మ. కొరియోగ్రఫీ: కళాధర్, కోనేటి రాజు.