calender_icon.png 9 October, 2024 | 6:27 PM

ఆర్యవైశ్య సంఘం నాయకులకు ఘనంగా సన్మానం

09-10-2024 03:58:22 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి వాసవి మాత దేవాలయంలో బుధవారం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిసారిగా విచ్చేసిన మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిలువేరు వైకుంఠం, మహాసభ రాష్ట్ర కార్యదర్శి ముక్తా శ్రీనివాస్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు బాల సంతోష్ లను ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బెల్లంపల్లిలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్యవైశ్య సంఘం నాయకులు చేయూతనివ్వాలని కోరారు. అదేవిధంగా మహాసభ సభ్యత్వాలను భారీగా పెంచాలని ఆర్యవైశ్య సంఘం నాయకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు పున్నం చందు, యువజన సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులు రేణికుంట్ల శ్రీనివాస్, కార్యదర్శి బాల ప్రసాద్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు కోడిపాక విద్యాసాగర్, కార్యదర్శి వేణుగోపాలు లు పాల్గొన్నారు.