calender_icon.png 16 October, 2024 | 7:36 PM

ఎంబీబీఎస్ సీట్ సాధించిన విద్యార్థినీలకు ఘన సన్మానం

16-10-2024 05:35:34 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని గుండాల మండల వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎంబీబీఎస్ లో సీట్ సాధించిన ఇద్దరు విద్యార్థినీలను ఘనంగా సన్మానించారు. గుండాల మండలంలోని సాయనపల్లి గ్రామానికి చెందిన ఇర్పా నాగేశ్వరరావు సుశీల దంపతుల కుమార్తెలైన అమృత రాణి, బేబీ ప్రసన్నలు ఎంబీబీఎస్ లో ఫ్రీ సీట్ సాధించడంతో గుండాల వాసవి క్లబ్ మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు వారికి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మానాల నారాయణమూర్తి, మానాల ప్రణీత్, తవుడిశెట్టి నాగరాజు, తవుడిశెట్టి రాంబాబు, అయితా శ్రీశైలం, అయితా పూజీత్, అయితా నాగమల్లయ్య, తాటికొండ వీరన్న, పాలడుగు భరత్, శ్రీరంగం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.