calender_icon.png 24 February, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బ్రహ్మంగారి కళ్యాణం

13-02-2025 02:01:22 AM

ఆలయ 30 వ వార్షికోత్సవ వేడుకలు 

జగిత్యాల, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీబ్రహ్మంగారి  ఆలయంలో శ్రీగోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రాచీన విధానంలో పూర్తి రాతి కట్టడంతో బ్రహ్మంగారి ఆలయాన్ని కోరుట్ల లో నిర్మించి మూడు దశాబ్దాలు ముగిసింది. 

ఈ సందర్భంగా దేవాలయ 30వ వార్షికో త్సవం, స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 4 వేల మంది భక్తులు పాల్గోని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.  స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో అధ్యక్షులు ఇందూ రి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బెజ్జరాపు చందు, కోశాధికారి శ్రీరాముల ప్రశాంత్,  నిర్వాహకులు ఇందూరి సత్యం, బెజ్జరాపు రాజు, సదానందచారి, బెజ్జరాపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.