calender_icon.png 25 October, 2024 | 5:57 AM

నగల దుకాణంలో భారీ చోరీ

25-10-2024 01:05:44 AM

15 కిలోల వెండి, ౩౦ గ్రాముల బంగారం అపహరణ

భైంసా, అక్టోబర్24 : భైంసా డివిజన్‌లోని కుభీర్‌లో గురువారం తెల్లవారు జామున ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. కుభీర్ ఎస్సై పీ రవీందర్, బాధితుడు, ఆకాశ్ జ్యువెలర్స్ యజమాని బచ్చు రమేశ్ వివరాల ప్రకారం.. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి దుకాణంలోకి చొరబడ్డారు.దుకాణంలోని సీసీ కెమెరాలను పగులగొట్టిలి చోరీకి పాల్పడ్డారు.

దుకాణం షెట్టర్ పగుల గొట్టి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుకాణం యజమాని, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దుకాణంలో దాచిన 15 కిలోల వెండి, 30 గ్రాముల బంగారం, రూ.58 వేలు దొంగిలించినట్టు గుర్తించారు.

దొంగలు బైక్‌పై వచ్చి,  పారిపోయినట్టు సమీపంలోని సీసీ కెమరాల్లో రికార్డు అయ్యింది. పోలీసులు జాగిలం, వేలిముద్రల నిపుణలను రప్పించి ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.18 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు.