calender_icon.png 25 October, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతబస్తీలో వైభవంగా ఘటాల ఊరేగింపు

22-07-2024 01:52:12 AM

చార్మినార్, జూలై 21: బోనాల ఉత్సవాల సందర్భంగా పాతబస్తీలో ఆదివారం సాయంత్రం శాలిబండ కాశీ విశ్వనాథ ఆలయం నుంచి అమ్మవార్ల సామూహిక ఘటాల ఊరేగింపు కనులపండువగా నిర్వహించారు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాల యాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో లాల్‌దర్వాజ మోడ్ వద్ద సామూహిక ఘటాలకు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హారతి ఇచ్చి స్వాగతం పలికారు. 

మహేశ్వరంలో..

మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. రావిరాల, మంఖాల్ గ్రామాల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఎమ్మె ల్యే పీ సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.