జహీరాబాద్, జూలై 12: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తూంకుంటా ప్రాథమిక పాఠశాలలో గౌతమ్కుమార్ అనే ఉపాధ్యాయుడు 12 సంవత్సరాలు పనిచేశారు. శుక్రవారం ఆయన బదిలీపై వెళ్తుండటంతో గ్రామస్థులంతా సన్మాన సభను ఏర్పాటు చేశారు. పాఠశాలలో పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి, గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యేలా చేశారు. పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గౌతమ్కుమార్ను పలువురు అధికారులు, గ్రామస్థులు కొనియాడారు. ఉపాధ్యాయుడి దంపతులకు గ్రామస్తులంతా బంగారపు ఉంగరాలను పెట్టి ఘనంగా సన్మానించారు. విద్యార్థులు కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బస్వరాజ్, నాయకులు ఓనమ్రెడ్డి, రాజు, హెచ్ఎం తిప్పారెడ్డి పాల్గొన్నారు.