చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తుండగా, గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్పై ఎంఎస్ రామ్కుమార్ నిర్మిస్తున్నారు. నవంబర్ 8న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది.
ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ మారుతి ఈ సినిమా టీజర్ను మంగళవారం విడుదల చేశారు. హీరోహీరోయిన్లు చేతన్, హెబ్బా లవ్స్టోరీతో టీజర్ ప్రారంభమైంది. ఈ లవ్ స్టోరీతోపాటు తండ్రీకొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్తో తెలుస్తోంది.
లవ్, ఫ్యా మిలీ, ఎమోషన్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి డైలాగ్స్: ప్రవీణ్ వర్మ; కొరియోగ్రఫీ: విజయ్ బిన్ని, భాను; లిరిక్స్: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి; ఫైట్స్: రియల్ సతీశ్; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి; మ్యూజిక్: గోపీ సుందర్.