28-02-2025 12:00:00 AM
బాలిక ప్రైవేట్ పార్ట్స్లో 28 చోట్ల కుట్లు
భోపాల్, ఫిబ్రవరి 27: భోపాల్లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏం డ్ల బాలుడు తాగిన మైకంలో ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఓ పా డుబడిన ఇంట్లోకి తీసుకుకెళ్లి ఆ చిన్నా రి మీద పాశవికంగా అత్యాచారం చే శాడు. ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రైవేట్ పార్ట్స్లో 28 కుట్లు వేశారు. మధ్యప్రదేశ్లోని శివపురిలో ఫిబ్రవరి 23న ఈ ఘటన జరగ్గా.. ఆ చిన్నారి ప్రస్తు తం ఆసుపత్రిలో కోలుకుంటోంది.
తన కామవాంఛ తీర్చు కునేందుకు గంటపాటు ఆ చిన్నారికి నరకం చూ పించి అనంతరం రక్తపు మడుగులో ఆ చిన్నారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. చిన్నారి తల్లిదం డ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ చిన్నారికి కోలోస్టమీ (శస్త్రచికిత్స) కూడా చేశారు.
ప్రస్తుతం చిన్నారి మా ట్లాడే స్థితిలో లేదని వైద్యులు తెలిపారు. గ్వాలియర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిన్నారికి చికి త్స అందిస్తున్నారు. ఆ బాలుడిని నడి రోడ్డులో ఉరితీయాలని కుటుంబసభ్యులు, స్థానికులు కోరుతు న్నారు. స్థానికులు ధర్నాలు చేస్తున్నారు.