వియంటియానె (లావోస్): ఏఎఫ్సీ అండర్-20 ఆసియా కప్- 2025 క్వాలిఫయర్ టోర్నీలో భారత్ నేడు ఇరాన్తో తలపడనుంది. మొదటి మ్యాచ్లో 4-1 తేడాతో మంగోలియాను మట్టికరిపించిన యువ భారత్ మరి నేటి పోరులో ఇరాన్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇరాన్ తన తొలి మ్యాచ్లో 8-0 తేడాతో లావోస్ను ఓడించింది. నాలుగు జట్లున్న గ్రూప్-జీలో ఒక్కో విజయం సాధించిన ఇరాన్, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మంగోలియా, లావోస్ చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. నేడు భారత్-ఇరాన్ మధ్య పోరులో గెలిచిన జట్టు తొలి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది.