calender_icon.png 25 October, 2024 | 12:01 AM

రూమ్‌మేట్స్ మధ్య ఘర్షణ

29-07-2024 01:28:30 AM

ఒకరి మృతి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): ఇద్దరు రూమ్‌మేట్స్ మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు దారుణ హత్యకు గురయ్యా రు. ఈ ఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి  చోటుచేసుకుంది. ఏపీలోని కర్నూ లు జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన వెంకటరమణ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో.. బార్బర్ షాప్‌లో పనిచేసే గణేష్ అనే వ్యక్తితో కలిసి షేరింగ్ రూమ్‌లో ఉంటున్నాడు. గణేష్ రోజూ మద్యం తాగి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన గణేష్ కటింగ్ షాప్‌లో ఉపయోగించే కత్తితో వెంకటరమణపై విచక్ష ణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘట నా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.