calender_icon.png 23 October, 2024 | 6:57 PM

బోరుబావిలోకి దిగి ఊపిరాడక రైతు మృతి

22-07-2024 03:06:22 AM

సూర్యాపేట, జూలై21(విజయక్రాంతి): బోరు బావిలోకి దిగిన రైతు ఊపిరాడక మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలో ఆది వారం చోటుచేసుకుంది. కలకోవకు చెందిన కొమర్రాజు లక్ష్మయ్య (45) గ్రామంలోని తిప్పాని మాధవరావుకు చెందిన  పొలాన్ని కౌలుకు చేస్తున్నాడు. ఆ వ్యవసాయ భూమిలో గతంలో ఉన్న బావి లో బోరు ఉండగా బోరు చుట్టూ గూనలు వేసి బావిని పూడ్చేశారు. ఈ క్రమంలో ప్రతీసారి బావిలోకి దిగి మోటార్‌కు మరమ్మ తులు చేయాల్సి రావడంతో ఆ గునలను తీసి పై వరకు కేసింగ్ పైపును ఏర్పాటు చేయాలనుకున్నాడు. దీనికోసం మోటార్‌ను పైకి తీసేందుకు గాను లక్ష్మయ్య మరో వ్యక్తి తో కలిసి తాడు సాయంతో బావిలోకి దిగ గా ఊపిరాడక అక్కడే మృతిచెందాడు. స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ బృందం సహకారంతో గూనలను జేసీబీతో తొలగించి లక్ష్మయ్య మృతదవేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య శేషమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.