లండన్: గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్-2024)లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన తొలి గేమ్ను డ్రాగా ముగించాడు. గురువారం ప్రారంభమైన గ్లోబల్ చెస్ లీగ్లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆనంద్ తొలి గేమ్ను ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ఆడాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గేమ్ హోరాహోరీగా సాగినప్పటికీ చివరకు డ్రాగా ముగిసింది.