calender_icon.png 15 October, 2024 | 5:31 PM

నిరుపయోగంగా ప్రాథమిక పాఠశాల భవనం

15-10-2024 03:46:16 PM

అనంతగిరి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత నూతన మండలాలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారు. మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేక విద్యాశాఖ మూసివేసింది. ఈ భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోకపోవడం వలన నిరుపయోగంగా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని ఉపయోగములోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.