26-02-2025 06:24:06 PM
భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ పట్టణం బొల్లోరిగూడెంలో వెలసిన శ్రీ లలత కామేశ్వర స్వామి వారి శివాలయంనకు కేటీపీయస్ ఉద్యోగి ఆంగోత్ అజయ్ కుమార్-విజయ దంపతులు శ్రీ లలితా అమ్మ వారికి ఎనభై వేల రూపాయల విలువ గల బంగారు ఆభరణంను ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం శుభ సందర్బంగా -(మంగళ సూత్రాలను) ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి సాయి చైతన్య శర్మ, ఆలయ ధర్మకర్తలు శివలెంక సుజాత శివలెంక అశ్విని కుమార్ లకు అందచేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు శనగ రామచందర్ రావు, సంగ్లోత్ రంజిత్, కొలిపాక రాధాకృష్ణ, వెంకట నారాయణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.