calender_icon.png 24 October, 2024 | 5:53 PM

ఏఐ సిటీని సందర్శించిన మంత్రుల బృందం

24-10-2024 01:44:24 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో రాష్ట్ర మంత్రుల బృందం బుధవారం ఏఐ సిటీని సందర్శించారు. అదేవిధంగా 1500 ఎకరాలలో ఏర్పాటు చేసిన ఇంచాన్ నగరంలోని స్మార్ట్ సిటీని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు విజిట్ చేశారు.

అత్యాధునిక సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని వినియోగించడంపై వివరాలు తెలుసుకున్నారు. ఈ నగరం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, పర్యాటక హబ్‌గా మారినట్లు గుర్తించారు. భవిష్యత్‌లో ఈ నగరం దక్షిణ కొరియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమైన స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.