calender_icon.png 29 September, 2024 | 3:52 AM

మరణశిక్ష పడే కేసిది

29-09-2024 01:45:18 AM

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ 

మాజీ ప్రిన్సిపాల్ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయం

కోల్‌కతా,  సెప్టెంబర్ 28: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని హత్యకేసుతోపాటు అనేక ఇతర కేసులు ఎదుర్కొంటున్న ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది.

సందీప్‌పై మోపిన అభియోగాలు చాలా తీవ్రమైనవని, అవి కోర్టులో నిరూపణ అయితే మరణ శిక్ష ఖాయమని.. అందువల్ల బెయిల్ ఇవ్వటం కుదరదని శనివారం తేల్చి చెప్పింది. అభియోగాల తీవ్రత  ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా చూపిస్తున్నదని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎస్ దే అభిప్రాయపడ్డారు. తల పోలీస్‌స్టేషన్ మాజీ ఎస్‌హెచ్‌వో అభిజిత్ మండల్‌కు కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది.