calender_icon.png 11 October, 2024 | 2:59 AM

బొగ్గువ్యాగన్‌లో మృతదేహం

09-10-2024 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 8 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరి ధిలోని కేటీపీఎస్ 5, 6 దశలకు సిం గరేణి నుంచి వచ్చిన బొగ్గు వ్యాగన్‌లో మృతదేహం లభ్యమైంది. కొత్తగూడెం పట్టణ పరిధిలోని రుద్రంపూర్ నుంచి కేటీపీఎస్‌కు బీఓఆర్‌బీ ద్వారా సోమవారం రాత్రి బొగ్గు సరఫరా అయ్యింది. బీఆర్‌ఓబీ మంగళవారం తెల్లవారుజామన కేటీపీఎస్‌కు చేరుకున్నది.

ఉదయం విధుల్లో ఉన్న కార్మికులు బొగ్గును గ్రిడ్ వద్ద దిగుమతి చేస్తు న్న క్రమంలో బొగ్గు కిందకు కారలే దు. గ్రిడ్‌ను శుభ్రం చేస్తున్న క్రమం లో మృతదేహం కనిపించింది. షిఫ్ట్ డీఈ సంఘటన స్థలానికి చేరుకొని ఎస్‌పీఎఫ్ జవాన్లకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పాల్వంచ పట్టణ ఎస్సై సుమన్ ఘటన వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశా రు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజర్‌కు చెందిన గుగులోత్  రమేష్(34) గా గుర్తించారు. డీఈ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.