calender_icon.png 25 September, 2024 | 7:47 PM

బర్త్‌డే పార్టీ అని పిలిచి వృద్ధురాలిపై దంపతుల దాడి

25-09-2024 03:28:47 AM

నగలు, నగదుతో జంప్

మేడ్చల్, సెప్టెంబర్ 24: శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గంగూడలో వృద్ధురాలిపై ఇంటి పక్కన అద్దెకున్న దంపతులు దాడిచేసి నగలు, నగదు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. శివ్వ రాములమ్మ ఇంటి పక్కన వారం రోజుల క్రితం భార్యాభర్తలు అద్దెకు దిగారు.

బర్త్ డే పార్టీ అని మంగళవారం.. రాములమ్మను ఇంటికి పిలిచి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమె ఒంటిమీద ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి పట్టీలు, ఆమె వద్ద ఉన్న కొంత నగదును అపహరించి పరారయ్యారు. కాసేపటికి వృద్ధురాలు అతికష్టం మీద నోటిలోని గుడ్డలు తీసుకొని అరవడంతో స్థానికులు ఆమెను కాపాడి..

పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే వారికి రాములమ్మనే ఇల్లు అద్దెకు ఇచ్చిందని..  సామాన్లు లేవని చెబితే తన ఇంట్లోనుంచి కొంత సామాను ఇచ్చినట్లు సమాచారం. పథకం ప్రకారమే వారు అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. ఎక్కడి వారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారని పోలీసు ల ప్రాథమిక విచారణలో తేలింది.