ఇద్దరు ప్రయాణికుల మృతి, తొమ్మిది మందికి గాయాలు
విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు28 (విజయక్రాంతి): హైదరాబాద్ జాతీయ రహదారి ఎన్హెచ్65 పై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని కొయ్యలగూడెం సమీపంలో శని వారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వస్తు న్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డు పక్కన ఆగిం ఉండగా..
ఓ భారీ కంటైనర్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టగా.. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమా దం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా కంటైన్..
బస్సును ఢీకొట్టడంతో బస్సులోని ప్రయాణికులు సీట్ల నుంచి ఎగిరిపడ్డారు. గాయపడిన వారిని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెం దిన వారిని ఖమ్మం జిల్ల్లాకి చెందిన ఫీల్డ్ ఇం జనీర్ ఎజ్జు రాజేందర్ తేజా(24), పాల సతీష్కుమార్ రెడ్డి(46)గా గుర్తించారు. చౌటు ప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.