రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): స్కూల్ బస్సు కిందపడి నర్సరీ చ దువుతున్న ఓ చిన్నారి మృతి చెందిన ఘట న సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగింది. నామా పూర్ గ్రామానికి చెందిన సల్కం భూమ, వె ంకటవ దంపతుల కూతురు మనోజ్ఞ(3) ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నర్సరీ చదువుతున్నది.
స్కూల్లో చిన్నారి ఆడుకుంటుండ గా.. బస్సును డ్రైవర్ వెనక్కి పోనివ్వడంతో టైర్ కిందపడి చి న్నారి అక్కడిక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో నే చిన్నారి మృతి చెందిందం టూ బంధువులు నిరసన వ్యక్తం చే శా రు. బాలిక తం డ్రి ఉపాధి నిమిత్తం తండ్రి గల్ఫ్లో ఉండగా.. త ల్లి ఇంటి వద్దే వ్యవసాయ పనులు చేస్తున్నది.