13-03-2025 12:10:02 AM
యాదాద్రి భువనగిరి, మార్చి 12 (విజయక్రాంతి) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిత్య అన్న ప్రసాదానికి హైదరాబాద్ బంజారా హిల్స్కు చెందిన శ్రీ కర్నాటి రమేష్ శ్రీదేవి దంపతులు ఐదు లక్షల రూపాయల చెక్కును ఆలయ కార్య నిర్వాహణాధికారి భాస్కరరావుకు బుధ వారం నాడు అందజేశారు. ఈ సందర్భం గా వారిని అర్చకులు ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.