calender_icon.png 28 September, 2024 | 4:48 AM

అయోధ్య రామున్ని దర్శించుకునే అవకాశం

28-09-2024 02:48:19 AM

 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ నుంచి శ్రీరాముడు కొలువుదీరిన అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఈ ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసులను ప్రారంభించడం వల్ల ఆయా నగరాల మధ్య హైదరాబాద్‌కు అనుసంధానం ఏర్పడి మరింత అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను కోరారు. సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం విమానయానరంగంలో అనేక సంస్కరణలను తీసుకొస్తుందన్నారు. 2014కు ముందు దేశంలో దాదాపు 70 విమానాశ్రయాల ద్వారా సేవలు అందుతుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 140 దాటిందన్నారు. కేవలం 10 ఏండ్లలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందని ఆయన వివరించారు.