మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): మూసీ నది ప్రాజెక్ట్లో భారీ స్కాం చోటు చేసుకుందని ఆరోపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 24న ఆదిలాబాద్లో నిరహించే కేటీఆర్ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీలు ఇచ్చి మోసం చేశారని ఈ నెల 8న డీఎస్పీకి ఫిర్యాదు చేశామని, అయినా ఇప్పటికీ కేసు నమోదు కాలేదన్నారు. 420 హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాని కోరారు. రేవంత్రెడ్డి ప్రజల ఆశలను గల్లంతు చేశారని, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న రాహుల్గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేశారు.