calender_icon.png 14 October, 2024 | 9:50 AM

నగర మేయర్‌పై కేసు నమోదు

14-10-2024 01:07:54 AM

సమయం దాటిన తర్వాత డీజే వాడటంతో పోలీసుల చర్యలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13(విజయక్రాంతి): సమయం దాటిన తర్వాత కూడా డీజే వాడటంతో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మరో ఇద్దరిపై కేసు నమోదైంది.ఈ నెల 10న సద్దుల బతుకమ్మ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్‌బీ నగర్‌లో వేడుకలు నిర్వహించారు.

అయితే రాత్రి 11.45 గంటలు తర్వాత కూడా డీజే పెట్టడంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బతుకమ్మ వేడుకలను ఎలా ఆపుతారంటూ మే యర్ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు కార్యక్రమ నిర్వాహకుడు విజయ్‌కుమార్, డీజే నిర్వాహకుడు గౌస్‌తో పాటు మేయర్ విజయలక్ష్మిపై ఆదివారం సుమోటోగా కేసు నమో దు చేశారు.