calender_icon.png 1 October, 2024 | 3:49 AM

అతి వేగంతో బైక్‌ను ఢీకొట్టిన కారు

30-09-2024 01:27:21 AM

బాబాయ్, కుమారుడు మృతి

నల్లగొండ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెం దిన ఇద్దరు దుర్మరణం చెందారు. ఆదివార ం  నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మం డల ం బుగ్గతండాకు చెందిన లోటావత్ భీముడు (23) తన అన్న కు మారుడు వెంకటేష్(8)తో బైక్‌పై నాంపల్లి మండలం రేఖ్యా తండాలో ని బంధువుల ఇంటికి బయల్దేరా రు.

కొండమల్లేపల్లి మండలం హైదరాబాద్ సాగర్ రహదారి పై చెన్నారం స్టేజీ మూలమలుపు వ ద్ద హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టి ంది. ఘటనాస్థలంలోనే వెంకటేష్ మృతిచెందగా.. భీముడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యం లో మృతి చెందాడు. మృతుల కుటు ంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మూ ర్తి తెలిపారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.