శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30: పట్టపగలే మహిళ దారుణ హత్యకు గురై న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్లోని సీబీఆర్ ఎస్టేట్ ప్లాట్ నం బర్ 101లో స్పందన(29).. భర్తతో గొడవల కారణంగా ఒంటరిగా ఉం టోంది.కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు నెలకొన్నాయి. వీరి విడాకు ల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు స్పందన ఫ్లాట్కు వెళ్లి ఆమెను దారుణంగా హత్య చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.