calender_icon.png 28 September, 2024 | 2:53 AM

దివ్యాంగుడి దారుణ హత్య?

28-09-2024 12:37:38 AM

మద్యం తాగించి చంపేశారు!

ఖమ్మం, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): దివ్యాంగుడు దారుణ హత్య కు గురైన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని గోవింద్రాల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గోవింద్రాల గ్రామానికి చెందిన ఆలోత్ బావ్‌సింగ్(35) దివ్యాంగుడు. శుక్రవారం గ్రామానికి సమీపంలోని హైస్కూల్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితి లో హత్యకు గురయ్యాడు.

గుర్తు తెలియని వ్యక్తులు అతడికి మద్యం తాగి ంచి, ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామేపల్లి పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచా రిస్తున్నారు. సీఐ తిరుపతిరెడ్డి ఘట నా స్థలాన్ని పరిశీలించారు.