calender_icon.png 30 April, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభగల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

29-04-2025 12:00:00 AM

14 మంది ఇంటర్ విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 28: ప్రతిభ గల విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉం టుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. దివంగత పద్మారెడ్డి జ్ఞాపకార్థంగా ఆమె కుమారుడు కృష్ణారెడ్డి ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణ త సాధించిన 14 మంది విద్యార్థులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ సన్మానించీ, ప్రోత్సాహకంగా పారితోషకాన్ని సోమవారం బెల్లం పల్లి క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

సాధించిన ప్రతిభను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కష్టప డి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంత మైన విద్యార్థులను ఆయన అభినందించా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదిత రులు పాల్గొన్నారు.