calender_icon.png 5 October, 2024 | 10:56 AM

మంటల్లో కాలిపోయిన బాలుడు

05-10-2024 01:59:49 AM

ఇంట్లో షార్ట్ సర్క్యూటే కారణం

ఈదులగట్టెపల్లిలో విషాదం

మానకొండూర్, అక్టోబరు 4: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఏడేళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన అంగిడి అనిత దంపతులకు రికిత (10), సాయికుమార్(7) ఇద్దరు పిల్లలు.

శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో విద్యుత్ వైర్లు తెగి ఇంటి ఎదుట ఉన్న పందిరి మీద పడటంతో మంటలు చెలరేగాయి. ఇంట్లోని ప్లాస్టిక్ పరదలకు మంటలు వ్యాపించడంతో పరదాల పక్కనే నిద్రిస్తున్న సాయికుమార్‌కు అంటుకుని కేకలు వేశాడు.

ఇంటి ఆవరణలో ఉన్న తల్లిదండ్రులు విని స్థానికులు సాయంతో తలుపులను ధ్వంసం చేసి బాలుడిని కాపాడే ప్ర యత్నం చేసినప్పటికీ అప్పటికే సా యికుమార్ మంటల్లో కాలి మృతిచెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు మానకొండూర్ సీఐ స్వామి తెలిపారు.