calender_icon.png 23 October, 2024 | 2:42 PM

అడవి పంది దాడిలో పల్టీ కొట్టిన బైక్

23-10-2024 12:38:55 PM

ఇద్దరికి తీవ్ర గాయాలు...

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): బైకుపై వెళ్తున్న ఇద్దరిని అడవి పంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వట్టిపల్లి గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు నాగర్ కర్నూల్ వైపు వస్తుండగా అదే గ్రామానికి చెందిన వెంకటయ్య కూడా లిఫ్ట్ అడిగి వస్తున్నారు. ఈ క్రమంలో చంద్రకల్ గ్రామ శివారులో అడవిపంది తగిలి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108 సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.