స్థానికుల భయాందోళన
ఆదిలాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా అడ వుల్లో అడపాదడపా పెద్ద పులులు, చిరుతల సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా బోథ్ మండలంలోని వజ్జర్ అడవు ల్లో పెద్దపులి సంచరించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. అటవీశాఖ అధికారులు బుధవారం వజ్జర్ అడవుల్లో పరిశీలించగా అడవి సమీపంలోని గుట్టల వద్ద పెద్దపులి సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు ఉన్నాయ ని అధికారులు నిర్ధారించారు.
అటవీ శాఖ అధికారులతోపాటు కొంత మంది గ్రామస్థులు సైతం పులిని చూసి అక్కడ నుంచి వెనుతిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులను వివరణ కోరగా పులి సంచరిస్తున్న మాట వాస్తమేనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.