calender_icon.png 14 October, 2024 | 8:08 AM

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్

14-10-2024 12:35:17 AM

పలువురిపై కర్రలతో దాడి

రాజేంద్రనగర్, అక్టోబర్ 13: వాకింగ్ చేసి వస్తున్న వారిపై గంజా యి బ్యాచ్ దాడులకు పాల్పడింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిం ది. స్థానికుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ ఎర్రబోడలోని నిర్మానుష్య ప్రాంతంలో కొంతకాలంగా కొందరు యువకులు గంజాయి తాగుతూ స్థానికులను ఇబ్బందిపెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం కొందరు వ్యక్తులు వాకింగ్ చేసి తమ ఇళ్లకు వస్తుండగా వారిపై కర్రలతో దాడి చేశారు. అడ్డువచ్చిన వారిపైనా దాడులకు తెగబడ్డారు. అదేవిధంగా పార్కింగ్ చేసిన ఓ కారు అద్దాలు సైతం ధ్వంసం చేశారు. బూతులు తిడుతూ నానా హైరానా సృష్టించార ని స్థానికులు తెలిపారు. గతంలో వారిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసు లు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.