హైదరాబాద్,(విజయక్రాంతి): డిమాండ్ల సాధన కోసం కార్యాచరణను ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. పెండింగ్ డీఏలు, బిల్లులు విడుదల చేయాలని, కొత్త పీఆర్సీ సిఫార్సులు అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఈనెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారిలకు జేఏసీ కార్యాచరణ లేఖ ఇవ్వనున్నారు. నవంబర్ 2న కలెక్టర్లు, 4,5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు లేఖలు ఇవ్వనున్న ఉద్యోగులు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 27 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. జనవరి 3,4న నల్లబ్యాడ్జీలతో విధులు, భోజన విరామంలో నిరసనలు, జనవరి 23న రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, జనవరి 30న రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.