calender_icon.png 8 February, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30ఏళ్ల పోరాటం ఫలించింది

08-02-2025 01:23:07 AM

* పెద్దపల్లి నియోజకవర్గంలో మాదిగల సంబురాలు

* సీఎంకు మంత్రి వర్గానికి, పెద్దపల్లి ఎమ్మెల్యేకు కృతజ్ఞత్వ ర్యాలీ

పెద్దపల్లి, ఫిబ్రవరి 7: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణలో ఎస్సీల వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్‌ను నియమిం చి, వర్గీకరణకు సానుకూల నివేదికను సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకొని ఈనెల 4న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావే శంలో ఆమోదం పొందిన సందర్భంగా పెద్ద పల్లి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం రోజున సంబరాలు జరుపుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి గకి మరియు మంత్రివర్గానికి మరియు స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే  చింత కుంట విజయరమణా రావు కు కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎస్సీ మాదిగ ఉప కులాలు,పెద్దపల్లి నియో జకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు.

పెద్దపల్లి స్థానిక జెండా చౌరస్తా నుండి కమాన్ మీదుగా బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్ర హం వరకు డప్పు చప్పులతో ర్యాలీ కొనసా గింది. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మాదిగల ఉద్యమ నేత పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ, సీఎం రేవంత్ రెడ్డి కి, ఎమ్మెల్యే  చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ప్రభు త్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వర్గీకరణకు సంబంధించి వెంటనే గెజిట్ పబ్లిష్ చేయాల ని మాదిగ సంఘాల నాయకులు ఈ సంద ర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాదిగ ఉప కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ నుండి మరో రెండు శాతం పెంచాలని కోరారు. వర్గీకరణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులకు నివాళులు అర్పించారు. 

పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు చిలుక సతీష్, ఎలిగేడు మండల నా యకులు కొండయ్య, జూలపల్లి మండల నాయకులు రామస్వామి ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

నాయకులు పాల రాజేశం, బొంకూరి నరసయ్య, పెరిక రాజేశం, కుక్క మల్లేష్, సిరిసిల్ల శంకర్, అరికె ళ్ల లచ్చయ్య, మారేపల్లి రాజు, కుమ్మరి ముఖే ష్, వడ్డేపల్లి బాలయ్య, కళాకారులు, మహిళా డప్పు బృందాలు, వందలాదిమంది మాదిగ సోదరులు పాల్గొన్నారు.