29-03-2025 01:07:45 AM
పెద్దపల్లి, మార్చి- 28 (విజయ క్రాంతి) : జిల్లాలో నేడు జరిగిన భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 99.9% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. భౌతిక రసాయన శాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని అన్నారు.
3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 11 సెంటర్లను, జిల్లా లెవెల్ అబ్జర్వర్ 1 పరీక్ష కేంద్రాలు, అసిస్టెంట్ కమిషనర్ పరీక్షల విభాగం 1 సెంటర్లను, జిల్లా విద్యాశాఖ అధికారి 2 పరీక్షా కేంద్రాలను సందర్శించారని తెలిపారు.
భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 7393 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 7385 మంది విద్యార్థులు హాజరయ్యారని, మొత్తం 99.9% హాజరు శాతం ఉందని, పరీక్షలు సజావుగా జరిగాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ప్రకటనలో పేర్కొన్నారు.