హైదరాబాద్: మియాపూర్ లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే అక్కడికి చేరుకున్న కుటుంబీకులు బాలుడిని చూసి కుప్పకూలిపోయి బోరున విలపించారు. బాలుడు నిన్న రాత్రి నుంచి కనబడకుండా పోయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలుడి మృతదేహంపై కుక్క కాట్లు ఉన్నట్లు గుర్తించారు. సాత్విక్ అనే బాలుడిని కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన మియాపూర్ లోని మక్త మహబూబ్ పేట్ గవర్నమెంట్ స్కూల్ వెనకాల ఉన్న డింపింగ్ యార్డ్ దగ్గర చోటుచేసుకుంది. బాలుడు ఆడుకుంటూ ఉండగా వీధికుక్కలు దాడిచేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.