calender_icon.png 1 April, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో హడలెత్తించిన దొంగలు

29-03-2025 10:49:57 AM

బీఆర్ఎస్ నాయకుని ఇంట్లో 14 తులాల బంగారం, కిలోన్నర వెండి ఎత్తుకెళ్లిన అగంతకులు

ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో రూ లక్ష నగదు, 3 తులాల బంగారం దొంగతనం

కాలనీలో నిలిపి ఉంచిన 4 బైకులు చోరీ

 కాల్ టెక్స్  లో కలకలం 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం(Bellampalli town)లో శనివారం తెల్లవారుజామున దొంగలు(Thieves) హడలెత్తించారు. కాల్ టెక్స్ ప్రాంతంలో ని రెండిళ్లలో చొరబడి పెద్ద మొత్తంలో దొంగతనానికి పాల్పడ్డారు. ఇటీవలనే గృహప్రవేశం చేసిన బి.ఆర్.ఎస్ నాయకులు సాన శ్రావణ్ తన ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని బీరువాని పగలగొట్టి అందులో నుండి 14 తులాల బంగారం, కిలోన్నర వెండిని ఎత్తుకెళ్లారు. అదే ప్రాంతంలోఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుధాకర్ కు చెందిన ఇంట్లో చొరబడి రూ లక్ష నగదు తో పాటు 3 తులాల బంగారం దోచుకెళ్లారు.

ఇదే ఘటనలో కాలనీలో ఇళ్ళ ముందు నిలిపి ఉంచిన 4 బైకులను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల నుండి విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్ధిన్(Bellampalli Rural CI Syed Afzaluddin) లతోపాటు బెల్లంపల్లి టూ టౌన్, తాళ్లగురిజాల , వన్ టౌన్ ఎస్సై లు కె .మహేందర్, చుంచు రమేష్, రాకేష్, ఏఎస్ఐ తిరుపతి లు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

డాగ్ స్క్వాడ్(Dog Squad) తో బాధితుల ఇళ్ళ తో పాటు పరిసర ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విషయం తెలిసిన వెంటనే బాధితుడు సాన శ్రావణ్ ఇంటికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దొంగలను గుర్తించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు. త్వరలోనే ఈ సంఘటనకు పాల్పడిన దొంగలను పట్టుకుంటామని ఏసిపి. ఏ. రవికుమార్ తెలిపారు. డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీం లతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.