calender_icon.png 7 February, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికలకు 15 నామినేషన్లు

07-02-2025 02:13:11 AM

  • గ్రాడ్యుయేట్ స్థానానికి 12 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 3

మొత్తం 28 నామినేషన్లు

కరీంనగర్, ఫిబ్రవరి6 (విజయక్రాంతి): మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలా బాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గురువారం 15 నామినేషన్లు దాఖలయ్యాయి.

గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది నామినేషన్ వేయగా టీచర్స్  ఎమ్మెల్సీకి ముగ్గురు నామి నేషన్లు దాఖలు చేశారు. నాలుగు రోజుల్లో మొత్తం 28 నామినేషన్లు దాఖలు అయినా యి.  అభ్యర్థుల నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి

సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెంది న లంటు చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మె ల్సీకి నామినేషన్ వేయగా కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన యాదగిరి శేఖర్ రావు తరఫున పచ్చునూరి సురేందర్ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన అబ్బగోని అశోక్ గౌడ్,

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన దేవతి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పెరుందేవి గూడేనికి రైకల సైదులు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండం పల్లికి చెందిన గుయ్య సాయి కృష్ణమూర్తి, కరీంనగర్ నగరానికి చెందిన ఎడ్ల సాయి కృష్ణప్రియ, 

సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దొడ్ల వెంకటే శం, మంచిర్యాల జిల్లా తిరుమలగిరి కాలనీకి చెందిన కొమిరెడ్డి మహేష్, నిజామాబాద్ కు చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూరు పల్లికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ కి నామినేషన్ దాఖలు వేశారు. 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి

మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపే ట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్‌కు చెందిన వై. అశోక్ కు మార్ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మల్కా కొమురయ్య బిజెపి అభ్యర్థి గా ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు వేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇదివరకే నామి నేషన్ వేసిన ఆదిలాబాద్ జిల్లా యాప ల్ గూడాకు చెందిన మంచి కట్ల ఆశమ్మ మరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. 

మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మా యిగూడేనికి చెందిన కంటే సాయన్న మరో సెట్ నామినేషన్ సమర్పించారు. 

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరి శ్రీకాంత్ మరో సెట్ నామినేషన్ అందజేశారు.