calender_icon.png 23 October, 2024 | 3:15 AM

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

10-07-2024 12:11:07 PM

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ వద్ద లక్నో - ఆగ్రా ఎక్స్ ప్రెస్ వేపై బుధవారం ఉదయం 5.15 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఉన్నావ్ వద్ద బీహర్ లోని సీతామర్హి నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్స్ వెనుక నుంచి ఓ పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సు మెత్తం పాల ట్యాంకర్ లోకి దూసుకుపోవడంతో బస్స రెండు పల్టీలు కొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 18 మంది మృతి చెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బస్సులో ఉన్న గాయపడిన క్షతగాత్రులను బయటికి తీసి చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.

మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చరీకి తరలించారు మృతుల్లో 14 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. యూపీ రవాణా మంత్రి దయాశంకర్‌సింగ్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.