* సుమారు 15 లక్షల నష్టం
కుమ్రంభీంఆసిఫాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): జిల్లాలోని సిర్పూర్ టి రైలే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రైలు ఢీకొనడంతో 180 జీవాలు మృత్యువాత పడ్డాయి. వరం పడటంతో రైల్వే స్టేషన్ సమీపంలో గొర్రెల కాపరులు నిద్రించా రు. అదే సమయంలో పక్కనే ఉన్న పట్టాలపైకి జీవాలు చేరుకున్నాయి. వాటి పైనుంచి రైలు దూసుకెళ్లడంతో శీర గ్రామానికి చెందిన జడ భీమయ్యకు చెందిన 170 గొర్రెలు, 10 మేకలు మృతి చెందాయి. సుమా రు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది.