ఉత్తరప్రదేశ్: రైల్వేకు సంబంధించిన మరో షాకింగ్ సంఘటనలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఆదివారం రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్ కనిపించింది. ఢిల్లీ-హౌరా రైలు మార్గంలో మహారాజ్పూర్లోని ప్రేమ్పూర్ స్టేషన్కు సమీపంలో ఉదయం 6.09 గంటలకు ఈ ఘటన జరిగింది. గూడ్స్ రైలు లోకో పైలట్ మార్గంలో ఉంచిన వస్తువును చూసి బ్రేకులు వేయడంతో పెను రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు కాన్పూర్ నుండి లూప్ లైన్ మీదుగా ప్రయాగ్రాజ్ వైపు వెళ్తుండగా పట్టాల మధ్యలో చిన్న గ్యాస్ సిలిండర్ ఉంచడాన్నిగమనించిన లోకో పైలట్ వెంటనే రైలును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానిక పోలీసులకు, రైల్వే అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలిని సందర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతు న్నారు. కాన్పూర్లో ఇటీవలి కాలంలో జరిగిన మూడో ఘటన ఇది. కొద్ది రోజుల క్రితం, పంకి పారిశ్రామిక ప్రాంతం సమీపంలో, సబర్మతి ఎక్స్ప్రెస్ ఇంజన్, 20 కోచ్లు పట్టాలు తప్పాయి. ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల పలుచోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దేశంలో రైలు పట్టాలు తప్పించే ప్రయత్నంలో, గుజరాత్లోని సూరత్ సమీపంలో రైల్వే ట్రాక్లపై ఫిష్ ప్లేట్లు, కీలను తొలగించిన ఒక పెద్ద సంఘటన వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.