calender_icon.png 19 October, 2024 | 6:00 PM

రూ.21 కోట్ల డ్రగ్స్ సీజ్

19-10-2024 01:26:52 AM

బెంగళూరులోని పోస్టాఫీస్ వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు

బెంగళూరు, అక్టోబర్ 18: బెంగళూరులో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఫారిన్ పోస్టాఫీస్ వద్ద నార్కొటిక్స్ కంట్రోల్ యూనిట్ కస్టమ్స్ అధికారులతో కలిసి సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.21 కోట్ల విలువైన 606 డ్రగ్స్ పార్శిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అమెరికా, బెల్జియం, యూకే, థాయ్‌లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన డ్రగ్స్‌లో హైడ్రోగంజాయి, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ క్రిస్టల్స్ ఉన్నాయని, వీటిని బెంగళూరులో అధిక ధరలకు అమ్మేందుకు నిందితులు పోస్టల్ సర్వీసుల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తు తేలింది.