16-04-2025 12:44:24 AM
సిటీ సివిల్ కోర్టు టీం విజయం
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): న్యాయశాఖ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూ ర్తితో భాగ్యనగరంలో ఉన్న సిటీ సివిల్ కోర్టు సిబ్బంది, సిటీ స్మాల్ కాజ్ కోర్టు సిబ్బంది, సిటీ సివిల్ కోర్టు సిబ్బంది, సికింద్రాబాద్ నాంపల్లి కోర్టు సిబ్బందికి ఇటీవల వచ్చిన మూడు రోజులపాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో సిటీ సి విల్ కోర్టు విన్నర్గా, నాంపల్లి కోర్టు టీం రన్నర్గా నిలిచాయి. మంగళవారం బోధన లక్ష్మారెడ్డి, ఎస్వి సుబ్బయ్య, వంశీలత, సు రేందర్, నరేష్, రాకేష్ హాజరై బహుమతులను అందజేశారు.