04-03-2025 01:14:37 AM
స్వీకరించిన అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, మార్చి 3(విజయక్రాంతి): జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 24 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.