Crime&legal

article_83373695.webp
బల్దియాలో కీచక కాంట్రాక్టర్

23-04-2024

గ్రేటర్ హైదరాబాద్ మున్సిప ల్ కార్పొరేషన్‌లో ఓ కాంట్రాక్టర్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. తన ఏజెన్సీలో నియామకమైన మహిళా ఉద్యోగులపై వేధింపు లకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదులు అందుతున్నాయి. బల్దియాలో 20 ఏండ్లుగా పాగా వేసుకున్న ఆ కాంట్రాక్టర్ ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు సమయం కానీ సమయంలో ఫోన్లు చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. గతంలో మేయర్ మందలించినా బుద్ది మార్చుకోక తన కీచక పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. తనకు న్యాయం చేయాల ంటూ ఓ మహిళా ఉద్యోగిణి 20వ తేదీన కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

article_63155018.webp
యజమానిని హత్య చేసిన బీహారీలు

23-04-2024

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో రాంరెడ్డి చికెన్‌సెంటర్ యజమానిని అతనివద్దనే పని చేస్తున్న ఇద్దరు బీహారీలు హత్య చేసి పరారయ్యారు. ఎస్‌ఐ చంద్రమోహన్ కథనం ప్రకా రం.. తూప్రాన్ మండలం వెంకటాపూర్‌కు చెందిన బుచ్చిరెడ్డి మహిపాల్‌రెడ్డి(40) జగదేవ్‌పూర్‌లో చికెన్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నా డు. తన దగ్గర పనిచేస్తున్న బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చికెన్‌సెంటర్‌లో ఉపాధి పొందుతూ రంజాన్ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లారు. వారి స్థానంలో బీహార్‌కి చెందిన కూరాబల్, రూబల్‌ను అనే వ్యక్తులను గత నెలలో పనిలో పెట్టుకున్నాడు. ప్రతి రోజు 8గంటల వరకు కొనసాగే చికెన్‌సెంటర్ ఆదివారం సాయంత్రం 5గంటలకే మూసివేశారు. ఆదివారం యజమానికి మహిపాల్‌రెడ్డి భార్య మానస నాలుగు గంటల ప్రాంతంలో ఫోన్ చేసి బంధువుల విందుకు రావాలని కోరగా సోమవారం ఆర్డర్ ఉందని ఇచ్చి వస్తానని చెప్పాడు.