Districts

article_61235523.webp
మార్మోగిన ‘జైహనుమాన్’ నామస్మరణ

24-04-2024

హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా జై హనుమాన్ నామస్మరణ మారుమోగిపోయింది. గజ్వేల్ పట్టణంలో హనుమాన్ భక్తులు శ్రీరాముడు, హనుమంతుడి భారీ విగ్రహాలతో శోభాయాత్ర ఘనం గా నిర్వహించారు. గజ్వేల్‌లో జరిగిన శోభాయాత్రలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్‌సి రాజమౌళి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అలాగే సిద్దిపేటలోని ప్రశాంత్‌నగర్ రావిచెట్టు హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్షా స్వాములతో కలిసి హరీశ్‌రావు సహపంక్తి భోజనం చేశారు.

article_12134462.webp
కొనుగోళ్లు వేగవంతం చేయాలి

24-04-2024

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం దుబ్బా క మార్కెట్‌యార్డులో కొనుగోలు కేం ద్రాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లు కప్పి ఉంచాలన్నా రు. జిల్లాలో 418కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 4536మంది రైతుల నుంచి 21,279 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఆయన వెంట సివిల్ సప్లు మేనేజర్ హరీశ్, దుబ్బాక తహసీల్దార్, సిబ్బంది ఉన్నారు.