మార్మోగిన ‘జైహనుమాన్’ నామస్మరణ
24-04-2024
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా జై హనుమాన్ నామస్మరణ మారుమోగిపోయింది. గజ్వేల్ పట్టణంలో హనుమాన్ భక్తులు శ్రీరాముడు, హనుమంతుడి భారీ విగ్రహాలతో శోభాయాత్ర ఘనం గా నిర్వహించారు. గజ్వేల్లో జరిగిన శోభాయాత్రలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అలాగే సిద్దిపేటలోని ప్రశాంత్నగర్ రావిచెట్టు హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్షా స్వాములతో కలిసి హరీశ్రావు సహపంక్తి భోజనం చేశారు.