అమ్మవారికి మంత్రి జూపల్లి పూజలు
26-04-2024
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో కొలువై ఉన్న జోగులాంబ అమ్మవారిని గురువారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని షా అలీ పహిల్వాన్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.