ఆదిలాబాద్లో నీటి ఎద్దడిపై ఆరా
20-04-2024
వేసవి దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యపై ఆరా తీసేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం పర్యటిస్తున్నది. ఇందులో భాగంగానే జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని డోంగర్గావ్, తోషం తండా, పులిమడుగు, కుమ్మరి తండా గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రా మ ప్రజలను తాగునీటి సరఫరా గురించి అడిగి తెలుసుకొన్నారు.