మాధవీలత నామినేషన్
25-04-2024
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బుధవారం మాధవీలత హైదరాబాద్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశా రు. తొలుత ఆమె చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీగా మదీనా చౌరస్తా, అఫ్జల్గంజ్, బేగంబజార్, మొజంజాహీ మార్కెట్, నాంపల్లి, ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీదుగా కలెక్టరేట్కు వెళ్లారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాలేదు.